పామర్రు, మే 05, (నేటి తెలుగు పత్రిక): జనగణన నమోదు ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించి తమ వివరాలను సంబంధిత ఏన్యూమరేటర్కు అందించాలని సూపర్వైజర్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పెదపూడి పవన్ కళ్యాణ్ కోరారు. పామర్రు పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటా జరుగుతున్న జనగణన నమోదు ప్రక్రియను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జనగణన నమోదు పక్కాగా నిర్వహిస్తూ, ప్రజల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. జనగణనలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ జనగణన నమోదు పట్ల ప్రజలకు వచ్చే సందేహాలను పవన్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు అయిన ఎన్యుమురేటర్లు పాల్గొన్నారు.
