Breaking News

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం

మే 05, (నేటి తెలుగు పత్రిక): సుప్రీం కోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది.ఈ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించగా, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త జడ్జీలు బాధ్యతలు స్వీకరించనున్నారు.జ్యుడీషియల్ అధికారులుగా ఉన్న సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీహెచ్ పురుషోత్తమ కుమార్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు.వారి నియామకంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగి, కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *