మే 05, (నేటి తెలుగు పత్రిక): మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ గెలిచిందని తెలిపారు.సీఎం పదవికి తాను రాజీనామా చేయనని, లోక్భవన్కు కూడా వెళ్లనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.ఈసీ, కేంద్ర ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ కలిసి కుట్ర పన్నాయని విమర్శించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.దేశంలో ఒకే పార్టీ పాలన తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
