మే 05, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం హర్షణీయమని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానుండటం రాష్ట్రానికి కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి ముఖ్యమైన సెక్షన్లు విశాఖ డివిజన్లో విలీనం కావడం ఉత్తరాంధ్ర రవాణా రంగానికి కొత్త దిశను తీసుకువస్తుందని అన్నారు.కొత్తగా ఏర్పడిన విశాఖ డివిజన్ మరియు రాయగడ డివిజన్ మధ్య సమన్వయం వల్ల రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్ర విజ్ఞప్తిని గౌరవించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
