మే 05, (నేటి తెలుగు పత్రిక): దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.ఇటీవల పరమపదించిన భాస్కరరావు గారి చిత్రపటానికి హైదరాబాద్లో పుష్పాంజలి ఘటించి నమస్కరించారు. గత నెల 22వ తేదీన ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు సమాచారం.ప్రత్యేకంగా, భాస్కరరావు గారి కుమారుడు మరియు మంత్రి నాదెండ్ల మనోహర్తో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యల కారణంగా వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయారు.ఇటీవల ఆరోగ్యం కుదుటపడడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు వచ్చి స్వయంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
