మే 05, (నేటి తెలుగు పత్రిక): టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తనను రూ.5 కోట్లు ఇవ్వాలని పార్టీ అడిగిందని ఆరోపించారు.ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం తాను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమేనని తెలిపారు. పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని విమర్శించారు. ఎవరైతే భారీ మొత్తంలో డబ్బు చెల్లించగలరో వారికే టికెట్లు ఇచ్చారని, పలువురు అభ్యర్థులు కోట్ల రూపాయలు చెల్లించి టికెట్లు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో తనకు ఎలాంటి అధికారాలు లేవని, సమస్యలు చెప్పినా స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకు గుడ్బై చెప్పిన మనోజ్ తివారీ ఇక మళ్లీ క్రికెట్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
