Breaking News

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు మే 05 ( నేటి తెలుగు పత్రిక ): ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.సామాజిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మిక తనిఖీని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిహెచ్సి సిబ్బంది పనితీరు, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్ల వెరిఫికేషన్, సిబ్బందికి ఉన్న సౌకర్యాలు అన్నింటినీ సమీక్షించారు. వైద్యులను రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. రోగుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని వెంటనే పై అధికారులతో మాట్లాడి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. వేసవి కాలంలో రోగులు అధిక ఉష్ణోగ్రతల వలన ఇబ్బందులు పడకుండా త్వరలోనే మార్గదర్శల సహకారంతో P4 పథకం ద్వారా ఎయిర్ కండిషనర్ ను అందజేస్తానని సిబ్బందికి తెలియజేశారు. నూతనంగా నిర్మిస్తున్న CHC భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *