మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ రైతు మేళాలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో దేవదాయ శాఖ మంత్రిగా నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ఆలయాల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం చూపుతూ, ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ద్వారా వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడమే తన వ్యాఖ్యల అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు.
