మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సహా ముగ్గురిపై బయో-టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన ఈ కేసులో, పబ్లిక్ ప్రదేశాల్లో రిసిన్ అనే అత్యంత విషపూరిత పదార్థాన్ని ఉపయోగించి సామూహిక విషప్రయోగానికి యత్నించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
