మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు పంట మార్పిడి విధానాలపై నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రిని కలిసి నివేదిక అందజేశారు.ఈ సందర్భంగా రైతుల్లో పంట మార్పిడిపై అవగాహన పెంపు, లాభదాయక వ్యవసాయ విధానాలపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరపాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పంట మార్పిడి అంశంపై శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు.పంట మార్పిడిపై మరింత లోతైన అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కమిషన్ను ముఖ్యమంత్రి కోరారు. ఈ భేటీలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు కమిషన్ సభ్యులు రాములు నాయక్, సునీల్, రాంగోపాల్ రెడ్డి, జి. గంగాధర్, కేవీ నర్సింహా రెడ్డి, సీహెచ్ వెంకన్న యాదవ్, ఎం. భవాని పాల్గొన్నారు.
