Breaking News

బిల్లు అడిగితే బీభత్సం.. మల్కాజ్‌గిరిలో రౌడీషీటర్ల దాడి

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించమన్నందుకు రౌడీషీటర్లు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 2న జరిగిన ఘటనలో, కత్తులు, కర్రలతో రౌడీషీటర్లు రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితులుగా ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపై పలు నేర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరూ గతంలో వనస్థలిపురంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో కూడా ప్రమేయం ఉన్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో శోధన కొనసాగిస్తున్నారు.నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే: ఈటెల రాజేందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *