మే 06, (నేటి తెలుగు పత్రిక): ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే రాజకీయంగా ఓడించారని అన్నారు.కేరళలో కాంగ్రెస్ విజయం సాధించిందని పేర్కొన్న ఆయన, తెలంగాణలో అభివృద్ధి పనులపైనే తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, ఆ ఫైల్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. మెట్రో విస్తరణకు త్వరగా ఆమోదం లభిస్తే నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
