Breaking News

కవిత రాజకీయ వ్యూహానికి కొత్త బలం – ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా చేరనున్నట్లు చర్చ

మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆమెకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా పని చేయనున్నారని సమాచారం.అక్టోబర్ నుంచి పీకే తన పనిని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఎన్నికల వ్యూహరచనలో మార్గదర్శనం చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ప్రత్యేకంగా క్షేత్రస్థాయి బలాన్ని పెంచడం, సోషల్ మీడియాలో ప్రభావాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.ఈసారి పీకే తన ఐ-ప్యాక్ టీంతో కాకుండా వ్యక్తిగత స్థాయిలో మాత్రమే సలహాలు ఇవ్వనున్నారని సమాచారం. కవిత ఇప్పటికే సోషల్ మీడియా వ్యూహాలపై దృష్టి పెట్టగా, పీకే చేరికతో ఆ ప్రయత్నాలు మరింత వేగం అందుకుంటాయని భావిస్తున్నారు.అయితే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం

ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *