మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కార్పొరేషన్ల నియామకాలు జూలైలో చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
నియమితుల వివరాలు ఇలా ఉన్నాయి:
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బస్వరాజు శ్రీనివాస్
- కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బండి రమేశ్
- వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్గా గట్టు తిమ్మప్ప
- యాదవ కార్పొరేషన్ చైర్మన్గా రఘునాథ్ యాదవ్
- వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా గుంజా రేణుక
- హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా దూడెం వెంకట రమణ
- లైవ్స్టాక్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా చరణ్ కౌశిక్
- తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకట రమణ
ఇతర నియామకాల్లో:
- వాషర్మెన్ కార్పొరేషన్ – డాక్టర్ అజయ్ కుమార్
- గీత కార్మిక కార్పొరేషన్ – చంద్రశేఖర్ గౌడ్
- పెరిక కార్పొరేషన్ – గొంగరి వెంకటేశర్లు
- మేర కార్పొరేషన్ – సంగ వెంకట్ రాజం
- మున్నూరు కాపు కార్పొరేషన్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
- పద్మశాలి కార్పొరేషన్ – గూడూరి శ్రీనివాస్
- వెలమ కార్పొరేషన్ – జువ్వాడి నర్సింగ్ రావు
ఈ నియామకాలతో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.
