Breaking News

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం

మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కార్పొరేషన్ల నియామకాలు జూలైలో చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

నియమితుల వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: సీఎం రేవంత్ ఆదేశాలు
  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్
  • కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండి రమేశ్
  • వాల్మీకి బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప
  • యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రఘునాథ్ యాదవ్
  • వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజా రేణుక
  • హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దూడెం వెంకట రమణ
  • లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్‌ సొసైటీ చైర్మన్‌గా చరణ్ కౌశిక్
  • తెలుగు అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకట రమణ

ఇతర నియామకాల్లో:

  • వాషర్‌మెన్ కార్పొరేషన్ – డాక్టర్ అజయ్ కుమార్
  • గీత కార్మిక కార్పొరేషన్ – చంద్రశేఖర్ గౌడ్
  • పెరిక కార్పొరేషన్ – గొంగరి వెంకటేశర్లు
  • మేర కార్పొరేషన్ – సంగ వెంకట్ రాజం
  • మున్నూరు కాపు కార్పొరేషన్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
  • పద్మశాలి కార్పొరేషన్ – గూడూరి శ్రీనివాస్
  • వెలమ కార్పొరేషన్ – జువ్వాడి నర్సింగ్ రావు

ఈ నియామకాలతో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.

మాజీ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *