Breaking News

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1 లక్ష కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు అనుమతి లభించింది. కడపలో అదానీ సంస్థ రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ.2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *