పామర్రు, మే 06, (నేటి తెలుగు పత్రిక): సమాజంలో యుక్త వయసులో గల బాలికలు తమ ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఎస్ రాజేశ్వరి పేర్కొన్నారు. కిషోరి వికాస కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల మండలం కపి లేశ్వరపురం సెక్టార్ పరిధిలోని మంటాడ 3 వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాక్కులు లైంగిక వేధింపుల నుంచి రక్షణ,లింగ అసమానత, సైబర్ రక్షణ, మహిళా సాధికారత తదితరాంశాలపై కిషోరి బాలికల కు అవగాహన కల్పించారు.రక్తహీనత వల్ల జరిగే అనర్ధాలను రాజేశ్వరి వివరించారు. జూన్ 9 వరకు నిర్వహించే ఈ వేసవి శిబిరాలను అంగన్వాడి పరిధిలో గల కిషోరి బాలికలు వినియోగించుకో వాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోఅంగన్వాడీ పరిధిలోని కిశోరి బాలికలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
