మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకం చెల్లదని పేర్కొంటూ జారీ చేసిన జీవోపై స్టే విధించాలని పిటిషనర్ టి. ధన్పాల్ రావు కోరారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని, యూపీఎస్సీ నుంచి అర్హుల జాబితా తీసుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. ఇప్పటికే డీజీపీ నియామకంపై కేసు పెండింగ్లో ఉండగానే కొత్తగా ఈ నియామకం చేయడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అలాగే చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఈ నియామకం ఇవ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
