రేవంత్ రెడ్డి తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సి. వి. ఆనంద్ కు ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ్ కోసం ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని స్పష్టం చేశారు.ఢిల్లీ పర్యటనలో ఎయిర్పోర్టు వద్ద జరిగిన ట్రాఫిక్ జామ్పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల దైనందిన పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.దీంతో డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శకాలు ఇచ్చారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించే విధానంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.అదేవిధంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం త్వరలో ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయడం, వర్షాకాలానికి ముందే జామ్ సమస్యలు నివారించడం, ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
