Breaking News

గైర్హాజరు వైద్యులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్యోగాల తొలగింపు: మంత్రి సత్యకుమార్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికార సెలవులు తీసుకున్న ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు చేపట్టింది. విధులకు గైర్హాజరైన 51 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్యుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరంగా అందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.తొలగింపునకు గురైన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. అదేవిధంగా మరికొందరు వైద్యులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.ఇక విధులకు గైర్హాజరైన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అంతరాయం కలగకుండా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *