విజయవాడ,మే 06, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరగా న్యాయం అందించాలంటే అన్ని విభాగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆమె.. పరిహారం చెల్లింపులో అర్హత నిర్ధారణ, నిధుల విడుదలలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. పెండింగ్ కేసులు, బడ్జెట్ అవసరాలపై జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.బాధితుల పునరావాసం కోసం హెల్ప్ సంస్థతో పాటు ఇతర ప్రతినిధుల సూచనలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
