మే 06, (నేటి తెలుగు పత్రిక): టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి నిరాకరించారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ మద్దతుతో కలిపి కూడా అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.రాజ్భవన్లో జరిగిన భేటీలో విజయ్ తనకు ఇతర పార్టీల మద్దతు లభిస్తుందని వివరించినప్పటికీ గవర్నర్ సంతృప్తి చెందలేదని సమాచారం.చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారికంగా మద్దతు ప్రకటిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
