Breaking News

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహమ్మద్ నసీర్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మైనారిటీలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.పీఎంజేవీవై కింద రూ.275 కోట్ల నిధులు విడుదల చేసినట్లు, మైనారిటీల అభివృద్ధికి రూ.1000 కోట్ల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.ఇమామ్‌లు, మౌజన్లకు బకాయి గౌరవ వేతనాలు విడుదల చేశామని, అర్హులైన వారికి కొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ముస్లిం మహిళల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. మైనారిటీ హాస్టళ్లలో ఖాళీల భర్తీ, రుణాలపై బ్యాంకులతో సమీక్షలు చేపడతామని చెప్పారు.అన్ని రంగాల్లో మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మహ్మద్ నసీర్ స్పష్టం చేశారు.

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

గైర్హాజరు వైద్యులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్యోగాల తొలగింపు: మంత్రి సత్యకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *