Breaking News

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు కేంద్ర ఆమోదం కోరిన సీఎం రేవంత్

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు త్వరగా ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మెట్రో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణపై చర్చించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అవసరమని సీఎం తెలిపారు. ఫేజ్‌-IIలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు చెప్పారు. మెట్రో ఫేజ్‌-Iను ఎల్‌అండ్‌టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో భవిష్యత్ విస్తరణలు సులభమవుతాయని పేర్కొన్నారు. అలాగే ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో ఫేజ్‌-III ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా కేంద్రానికి సమర్పించినట్లు వెల్లడించారు.

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *