Breaking News

ఆపరేషన్ సింధూర్ వీరులకు ప్రధాని మోదీ అభినందనలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆపరేషన్ సింధూర్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం ధైర్యసాహసాలను కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ దేశ భద్రతా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొన్న ప్రతి సైనికుడికి దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశ ప్రజల్లో భద్రతా భావన మరింత బలపడిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఆపరేషన్ సింధూర్ చిహ్నాన్ని ప్రొఫైల్ చిత్రంగా మార్చారు. భారత వాయుసేన విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఈ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దళాలు విజయవంతంగా దాడులు నిర్వహించాయి.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

సంఖ్యాబలం లేక విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ నిరాకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *