మే 07, (నేటి తెలుగు పత్రిక): అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను తయారు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణను కలిసి ఆయన ప్రతిభను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6×12 పరిమాణ జెండాతో పాటు ఎర్రకోటపై ఎగురవేసే 8×12 జాతీయ జెండాను కూడా తాను రూపొందించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే దేశంలో అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను తయారు చేసినట్లు చెప్పారు. చేనేత రంగంలో ఆయన చూపిన ప్రతిభ అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు.
