Breaking News

అతుకుల్లేని జాతీయ జెండా రూపొందించిన నేతన్నకు లోకేశ్ అభినందనలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను తయారు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణను కలిసి ఆయన ప్రతిభను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6×12 పరిమాణ జెండాతో పాటు ఎర్రకోటపై ఎగురవేసే 8×12 జాతీయ జెండాను కూడా తాను రూపొందించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే దేశంలో అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను తయారు చేసినట్లు చెప్పారు. చేనేత రంగంలో ఆయన చూపిన ప్రతిభ అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు.

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *