Breaking News

ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): వరి ధాన్యం రవాణా సజావుగా జరిగేలా తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు అవసరమైన వాహనాలను సమీకరించాలని జిల్లా రవాణా అధికారులను ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. సరిపడా గూడ్స్ వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణా వాహనాలకు ఆర్సీ, ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని చెల్లుబాటు పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుని ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *