Breaking News

తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న రామచందర్‌రావు

మే 07, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తెలంగాణలో కూడా పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తార్నాకలో నిర్వహించిన వాల్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని రూ.8 వేల కోట్ల నిధులు ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి పార్టీ గౌరవించాలని సూచించారు.

కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *