మే 07, (నేటి తెలుగు పత్రిక): మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?’ అంటూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.వీడియోలో లోకేశ్ కొత్త లుక్లో, ట్రెండీ కళ్లజోడుతో బుల్లెట్ బైక్ నడుపుతూ కనిపించారు. దీనికి “Guess who’s coming to AP?” అనే క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్పై నెటిజన్లు స్పందిస్తూ ఏపీలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుందనే అంచనాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో రూ.2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేశ్ ఈ పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు.
