Breaking News

మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణనే: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మే 07, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తదుపరి లక్ష్యం తెలంగాణనేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గుల్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించిందని చెప్పారు. అదే ఉత్సాహం తెలంగాణలో కూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మోదీ బహిరంగ సభను భారీగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *