Breaking News

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసి డబ్బులు వసూలు చేస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ప్రధాన నిందితుడు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికతో పరిచయం పెంచుకుని, తర్వాత ఆమెను బెదిరింపులకు గురి చేసినట్లు గుర్తించారు. గతంలో పోక్సో కేసులో అరెస్టైన అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా బాలికతో తిరిగి సంప్రదింపులు కొనసాగించినట్లు సమాచారం.ఈ కేసులో ఇంటి పనిమనిషి సరస్వతి పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. బాలిక వ్యక్తిగత విషయాలు బయటపెడతానంటూ బెదిరించి రూ.9 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో అర్జున్ బాధితురాలి నుంచి సుమారు రూ.13 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందిడబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అర్జున్ తల్లి ఖాతాల్లోకి కూడా డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మరో యువతి కూడా అర్జున్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు మరింత కీలకంగా మారింది.సోషల్ మీడియా ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకునే మోసాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *