మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాలు జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వెలువడ్డాయి. టీవీకే పార్టీకి 108 అసెంబ్లీ సీట్లు ఉన్నాయని, కాంగ్రెస్, వీసీకే మద్దతుతో మొత్తం బలం 114కు చేరినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
