మే 07, (నేటి తెలుగు పత్రిక): స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. మన్యం ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన విప్లవ యోధుడిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెల్లవారిని గడగడలాడించిన ధైర్యవంతుడైన నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా దేశభక్తిని స్మరించుకుంటూ నివాళి అర్పించాలని సీఎం పిలుపునిచ్చారు.
