మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాలు, జిల్లాల వారీ ఆర్థిక ప్రగతి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జీఎస్డీపీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. జిల్లాల అభివృద్ధి పనులు, పెట్టుబడుల పురోగతి, విద్య, వైద్యం, జలధార వంటి పథకాల అమలుపై కూడా సమీక్ష కొనసాగుతోంది.స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై అధికారులు, కలెక్టర్లు తమ నివేదికలను సమర్పిస్తున్నారు. వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను కూడా సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. మంత్రులు తమ సింగపూర్ పర్యటన అనుభవాలను కూడా పంచుకుంటున్నారు.
