Breaking News

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత సేవల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 1.37 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించినట్లు వివరించారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. సింగపూర్ అధ్యయన పర్యటన ద్వారా పాలనలో అనేక అంశాలు నేర్చుకున్నామని, వాటిని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *