మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, బండి సంజయ్ రాజకీయ జీవితం, ఆర్థిక వనరులపై ప్రశ్నలు లేవనెత్తారు. రేవంత్ రెడ్డి–బండి సంజయ్ మధ్య రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ ఏది మాట్లాడితే అదే బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కేటీఆర్తో చర్చకు రావాలంటే బండి సంజయ్ ధైర్యం చూపించాలని సవాల్ విసిరారు.
