మే 07, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను తొలగించింది. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. కమిటీ నియామకం ద్వారా పిఠాపురం పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది.
