Breaking News

అసత్య ప్రచారంపై కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ తెలుగు గాయని మంగ్లీ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో, వెబ్‌సైట్లలో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.మైక్రో ఫైనాన్స్ వివాదంతో తనకు సంబంధం లేనప్పటికీ తన పేరును కావాలనే లాగారని ఆమె ఆరోపించారు. ఇలాంటి తప్పుడు వీడియోలు, పోస్టులు వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో పలు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తన గౌరవాన్ని దెబ్బతీస్తోందని మంగ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు ప్రస్తుతం తెలుగు సినీ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *