మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి సీపీ సుమతి ఆధ్వర్యంలో అర్ధరాత్రి ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సాధారణ మహిళలా వేషం వేసుకుని స్వయంగా రోడ్డుపై నిలబడి పరిస్థితిని గమనించారు. దిల్సుఖ్నగర్ పరిసరాల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది.ఈ సమయంలో కొందరు ఆకతాయిలు అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడగా, వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 40 మంది ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.మహిళలపై వేధింపులు, ఈవ్టీజింగ్ను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. సీపీ సుమతి తీసుకున్న ఈ చర్య మహిళల భద్రతపై బలమైన సందేశాన్ని ఇచ్చిందని అధికారులు తెలిపారు.
అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్తో ఆకతాయిలపై పోలీసుల చర్య
