మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘యువ నాటకోత్సవాలు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. డిజిటల్ ప్రచారం, రీల్స్, వీడియోలు యువతను భారీగా ఆకర్షించాయని పేర్కొన్నారు.సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారిందని, వినూత్న ప్రచారంతో ప్రజల మనసులు గెలుచుకోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. విజయ్కు సినీ నేపథ్యం, ప్రజల్లో ఉన్న గుర్తింపు కూడా రాజకీయ విజయానికి తోడ్పడిందన్నారు.కళలు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన వేదికలని పేర్కొన్న మంత్రి.. యువత కళారంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో యువ కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
