బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఫీజుల దోపిడీపై కవిత ఫైర్.. “మాట తప్పితే రాళ్లతో కొట్టండి”

ఫీజుల దోపిడీపై కవిత ఫైర్.. “మాట తప్పితే రాళ్లతో కొట్టండి”

మే 07, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత విమర్శించారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఫీజు నియంత్రణ కోసం వెంటనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.ప్రతి ఏడాది ప్రైవేట్ స్కూళ్లు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని మండిపడ్డ కవిత.. తల్లిదండ్రుల బలహీనతను విద్యాసంస్థలు దోపిడీకి ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా ఉన్న రూ.11 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఎంఎస్-7 జీవోను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన కవిత.. “నేను మాట తప్పితే అమరుల స్థూపానికి కట్టేసి రాళ్లతో కొట్టండి” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి