Breaking News

ఫీజుల దోపిడీపై కవిత ఫైర్.. “మాట తప్పితే రాళ్లతో కొట్టండి”

మే 07, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత విమర్శించారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఫీజు నియంత్రణ కోసం వెంటనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.ప్రతి ఏడాది ప్రైవేట్ స్కూళ్లు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని మండిపడ్డ కవిత.. తల్లిదండ్రుల బలహీనతను విద్యాసంస్థలు దోపిడీకి ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా ఉన్న రూ.11 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఎంఎస్-7 జీవోను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన కవిత.. “నేను మాట తప్పితే అమరుల స్థూపానికి కట్టేసి రాళ్లతో కొట్టండి” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కీలక విద్యా మార్పు దిశగా అడుగులు – పాఠశాలల్లోనే ఇంటర్ విలీనం యోచన

బీసీ కులగణన డిమాండ్‌తో ఆమరణ దీక్షకు దిగిన వీహెచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *