Breaking News

విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పుకు అవమానం: కమల్ హాసన్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 108 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెంటనే ఆహ్వానించకపోవడంపై నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ స్పందించారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు.ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించిన స్టాలిన్ రాజకీయ పరిణతిని తాను అభినందిస్తున్నానని కమల్ హాసన్ తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ.. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలో నిరూపించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా నిర్ణయాలు ఉండాలని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు

బెంగాల్‌లో చారిత్రక మలుపు – ప్రజలకు మోదీ కృతజ్ఞతలు, సువేందు అధికారి సీఎం ప్రమాణ స్వీకారం

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోసం తిరుమావళవన్‌ను కలవనున్న విజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *