మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి భారీ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెలలోనే కడప జిల్లా సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులో మరో ఆరు ఉక్కు కర్మాగారాలు కూడా రాష్ట్రంలో ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు.జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, భారీ పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని తెలిపారు.
