Breaking News

ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

మే 08, (నేటి తెలుగు పత్రిక): రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం.ఇక మరోవైపు తాజాగా తండ్రిగా మారిన సూర్యకుమార్ యాదవ్ కూడా మే 10న జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశమున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ మళ్లీ ముంబైకి నాయకత్వం వహించవచ్చనే ప్రచారం జోరందుకుంది. “హిట్‌మ్యాన్” కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంతో అభిమానులు కూడా ఆయన తిరిగి కెప్టెన్‌గా రావాలని కోరుకుంటున్నారు.

తండ్రైన టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

కమిన్స్‌ను కాపాడుకునేందుకు సీఏ భారీ ప్లాన్.. రూ.113 కోట్ల ఆఫర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *