Breaking News

జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రశాసన్‌నగర్‌లోని ఫ్లాట్ నంబర్‌ 46లో నివసిస్తున్న మాజీ అదనపు డైరెక్టర్ జనరల్‌ వినయ్‌రంజన్‌రాయ్ భార్య సునందను ఇంట్లో పనిచేసే నేపాల్‌ గ్యాంగ్ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. హత్య అనంతరం ఇంట్లోని విలువైన నగదు, ఆభరణాలతో నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *