మే 08, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యారు. ఆయన భార్య దేవిశా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.2016లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇది తొలి సంతానం. ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తూ టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో ఆనందం నెలకొంది.ఒకవైపు ప్రపంచకప్ విజయం, మరోవైపు కూతురు జననం కావడంతో సూర్య కుటుంబంలో డబుల్ సంబరాలు వెల్లివిరిశాయి.
