బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి.
ముషీరాబాద్, మే 08,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారని బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కుందారం గణేష్ చారి కలిసి మంత్రికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం గణేష్ చారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర మంత్రిగా పొన్న ప్రభాకర్ ఎదిగారని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరి కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నేనలు పొందుతున్నారని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తాటికొండ విక్రమ్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, అనంతజు బ్రహ్మచారి, తాటికొండ శ్రీనివాస్ చారి, ఎల్లంకి వెంకటేష్, భాస్కర్, నరేష్, జాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
