Breaking News

మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు: రామచందర్‌రావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు కనిపిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.హైదరాబాద్‌లో సభ ఏర్పాట్లను పరిశీలించిన రామచందర్‌రావు మాట్లాడుతూ.. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. రెండు లక్షలకు పైగా ప్రజలు సభకు హాజరవుతారని, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు.పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు రెండు రోజుల పాటు కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో ఉంటాయని వెల్లడించారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రేటర్ ఎన్నికల ముందు మోదీ సభ జరగడం బీజేపీకి అనుకూలంగా మారుతుందని రామచందర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ.. తెలంగాణ, ఓబీసీ అంశాలపై కీలక డిమాండ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *