మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీకే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడం అవసరమని చిదంబరం అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందో లేదో నిర్ణయించాల్సింది అసెంబ్లీ మాత్రమేనని, రాజ్భవన్ కాదని స్పష్టం చేశారు.అతిపెద్ద పార్టీ నాయకుడిని ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, అనంతరం శాసనసభలో బలపరీక్ష నిర్వహించడం సరైన రాజ్యాంగ ప్రక్రియ అని పేర్కొన్నారు. లేకపోతే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమవుతుందని వ్యాఖ్యానించారు.హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని చిదంబరం సూచించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ పార్టీల మద్దతులతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
