Breaking News

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో జరిగిన దాడి ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.హైదరాబాద్‌లో డీజీపీని కలిసిన బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.కరీంనగర్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని డీజీపీని కోరారు. రాజకీయ ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి: కేబినెట్ సబ్ కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *