Breaking News

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న లోకేశ్‌కు దేవాదాయ కమిషనర్ రాంచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రి లోకేశ్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆయన ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.లోకేశ్‌ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారు వేమూరి రవికుమార్ కుమారుడు కిరణ్ వివాహ వేడుకలో కూడా పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *